లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ కార్యక్రమం
పెందుర్తి: లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించాలని సూచిస్తున్నప్పటికీ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఇవేం పట్టడం లేదు. విపత్తు వేళ కూడా తనదైన శైలిలో వెకిలి రాజకీయాలను కొనసాగించారు.
♦ లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ గవర జగ్గయ్యపాలెంలో బుధవారం పార్టీ కార్యక్రమం నిర్వహించడం తీవ్రస్థాయిలో విమర్శలకు తావునిచ్చింది. కనీసం భౌతిక దూరం పాటించకుండా క్యాడర్తో ముచ్చట్లాడారు.
♦ లాక్డౌన్ ప్రారంభం నుంచి పత్తా లేకుండాపోయి సహాయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బండారు.. అకస్మాత్తుగా ఇలా పార్టీ కార్యక్రమం నిర్వహించడంపై ప్రజలు ఆక్షేపిస్తున్నారు. కొందరు టీడీపీ మాజీ కార్యకర్తలకే పార్టీ కండువాలు కప్పి.. టీడీపీలో చేరారన్న బిల్డప్లు ఇవ్వడం ఈ కార్యక్రమంలో కొసమెరుపు.