సీఎం పర్యటనలో అపశ్రుతి

26 Jul, 2014 02:27 IST|Sakshi

గుర్తుతెలియని వాహనం ఢీకొని టీడీపీ కార్యకర్త మృతి
 ముదిగుబ్బ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముదిగు బ్బ పర్యటనను తిలకించడానికి ద్విచక్రవాహనంలో వస్తూ గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో పార్టీ కార్యకర్త ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యా యి. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. నార్పల మండలం గడ్డంనాగేపల్లికి చెందిన గంగాధర్, తాడిపత్రి మండలం యర్రగుంటపల్లికి చెందిన రవికుమార్ శుక్రవారం సీఎం పర్యటనలో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంలో ముదిగుబ్బకు బయలుదేరారు.
 
 మార్గం మధ్యలో మండలంలోని సంకేపల్లి సమీపంలో 205 జాతీయ రహదారిపై వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలకు గురైన గంగాధర్ అలియాస్ బాబు(30) అక్కడికక్కడే మృతిచెందగా, రవికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు రవికుమార్‌ను బత్తలపల్లి ఆర్‌డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు