వెలుగులోకి జేసీ అవినీతి బాగోతాలు

2 Jun, 2020 14:28 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ  దివాకర్‌ రెడ్డి అక్రమాలు మరోసారి బయటపడ్డాయి. దివాకర్‌ ట్రావెల్స్‌ పేరుతో జేసీ సాగిస్తున్న తెరవెనుక బాగోతాలు రవాణాశాఖ జరుపుతున్న దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బీఎస్‌-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్‌-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్‌ చేయించిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా.. జేసీ ట్రావెల్స్‌కు చెందిన 4 టిప్పర్లను సీజ్‌ చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 54 వాహనాలను రవాణాశాఖ సీజ్‌ చేసింది. ఇంకా 97 బస్సులు, లారీలను రహస్య ప్రదేశాల్లో దాచినట్లు తెలుస్తోంది. చదవండి: గ్రామ వాలంటీర్ గొప్పతనం 

మరిన్ని వార్తలు