అసెంబ్లీ మార్షల్స్‌తో టీడీపీ నేతలు వీరంగం

12 Dec, 2019 10:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్లకార్డులు తీసుకువెళ్లడానికి అనుమతి లేదన్న మార్షల్స్‌పై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. దీంతో అసెంబ్లీ గేట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీలోకి  ప్లకార్డులు తీసుకెళితే ఏం చేస్తారంటూ టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. అక్కడతో ఆగకుండా చంద్రబాబునాయుడు, లోకేష్‌, టీడీపీ నేతలు అసెంబ్లీ గేట్లు నెట్టుకొని వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతల వద్ద ప్లకార్డులు లాక్కున్నారు. మార్షల్స్‌ తీరుపై చంద్రబాబు, లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా చేస్తున్నారా.. ఏ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అగ్రహించారు.

మరిన్ని వార్తలు