అంకితభావంతో పని చేయండి : జగన్‌

16 Oct, 2018 06:34 IST|Sakshi

ప్రజాసంకల్పయాత్ర బృందం: పార్టీలో చేరిన వారు అంకితభావంతో ఐక్యంగా కలిసి పని చేసి పార్టీ విజయానికి పాటుపడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. బాడంగి మండలం డొంకినవలస ఆర్‌ఎస్‌ వద్ద ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ సమక్షంలో గొల్లాది, డొంకినవలస, తెంటువలస, వీరసాగరం తదితర గ్రామాలకు చెందిన 300 కుటుంబాలకు పైగా టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సోమవారం చేరారు. వీరికి జగన్‌ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. గొల్లాది నుంచి కురిటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో వీరంతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో డొంకినవలస నుంచి గండి పైడితల్లి, కర్రి సత్యం, తెంటువలస నుంచి పూడి రాము, తెంటు అప్పలనాయుడు, వీరసాగరం నుంచి మరిపి తిరుపతి, ఆవు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు