వైఎస్సార్‌సీపీలోకి ఏపీ టీడీపీ నేతలు 

31 Jan, 2019 01:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/పిడుగురాళ్లటౌన్‌ : ఏపీవ్యాప్తంగా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్‌ అధినేత వున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు వున్నం నాగమల్లికార్జునరావు బుధవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి వైఎస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

వారితో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ కాసు మహేశ్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంటు ఇన్‌చార్జి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ నేతలు జంగా వెంకటకోటయ్య, రేపాల శ్రీనివాసులు తదితరులున్నారు

మరిన్ని వార్తలు