ఎమ్మెల్యే గౌతు శివాజీకి మళ్లీ అవమానం

24 Mar, 2017 11:12 IST|Sakshi
ఎమ్మెల్యే గౌతు శివాజీకి మళ్లీ అవమానం

అమరావతి: నిన్న కరకట్ట... ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎదుట శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, అధికారపార్టీ సభ్యుడు గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీకి సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. శుక్రవారం శాసనసభ సమావేశాలకు హాజరు అవుతున్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సిబ్బంది ఎమ్మెల్యే శివాజీని అసెంబ్లీ లోపలకి అనుమతించలేదు. అయితే ఐడీకార్డు చూపించి తనిఖీ చేసిన తర్వాతే ఆయనను లోనికి అనుమతించారు.

కనీసం పీఏ కూడా లేని తనలాంటి వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపుతున్నారని, అదే సుమారు ఓ 15మందిని వెంట తీసుకొచ్చే బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నల లాంటివారికి మాత్రం  సెల్యూట్‌ కొడతారని ఎమ్మెల్యే శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా  ఆయన నాలుగురోజుల క్రితం కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో  శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట‍్ట దగ‍్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు.

మరిన్ని వార్తలు