స్పీకర్ కార్యాలయం నోట్తో.. రాజీనామాల విషయంలో టీడీపీ ఎంపీల బండారం మొత్తం బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు లాగే టీడీపీ ఎంపీలు కూడా తమ దొంగ బుద్ధిని ప్రదర్శించారని, వాళ్లకు సమైక్యాంధ్ర విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయం దీంతో బట్టబయలైందని ఆయన విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి లేదన్న విషయాన్ని సీమాంధ్ర ప్రాంత ప్రజలు గుర్తించాలని జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమైక్యవాదానికి గట్టిగా కట్టుబడి ఉందని ఆయన అన్నారు.