విజయనగరం :వైఎస్సార్ సీపీ అభిమానులమని తెలుగుదేశం నాయకులు కక్ష కట్టి వేధిస్తున్నారు. నా తండ్రి రొంపిల్లి తిరుపతిరావు ఎంఆర్ నగర్ పంచాయతీ సర్పంచ్గా గతంలో ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నా తండ్రి చెక్ పవర్ రద్దు చేయించారు. నా తండ్రి మీద కక్షతో వైఎస్సార్ సీపీకి చెందిన అర్హులైన 58 మంది పింఛన్లు నిలిపివేశారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తే 36 మందికి పింఛన్లు వచ్చాయి. మిగతా వారికి మంజూరు కాలేదు.– రొంపిల్లి లక్ష్మీ, ఎంఆర్ నగర్, పార్వతీపురం