ఎల్లో మీడియా రాతలవల్లే టీడీపీ గెలిచింది: బొత్స

17 Jun, 2014 18:47 IST|Sakshi
ఎల్లో మీడియా రాతలవల్లే టీడీపీ గెలిచింది: బొత్స
విజయవాడ: ఎల్లో మీడియా కల్పిత రాతల వల్లే టీడీపీ గెలిచిందని మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాజా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై సమీక్ష సమావేశంలో బొత్స పాల్గొన్నారు. భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభావం రాష్ట్ర ప్రజలపై ఎక్కడా లేదు అని బొత్స వ్యాఖ్యానించారు. 
 
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బొత్స అన్నారు. తీవ్ర వ్యతిరేకతే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమని బొత్స విశ్లేషించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించని సంగతి తెలిసిందే. 
మరిన్ని వార్తలు