విధులకు డుమ్మాకొట్టిన టీచర్ సస్పెండ్

27 Aug, 2015 21:42 IST|Sakshi

కడప ఎడ్యుకేషన్ (వైఎస్సార్ జిల్లా): నెల రోజులుగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడిని డీఈవో గురువారం సస్పెండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం ఒడ్డిపాళెం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న జనార్దన్‌రెడ్డి నెల రోజులుగా విధులకు డుమ్మాకొడుతున్నారు. డీఈవోకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజర్ అయిన టీచర్‌ను డీఈవో సప్సెండ్‌చేశారు.

మరిన్ని వార్తలు