టెక్కలిరూరల్, న్యూస్లైన్: అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తానని తెలుపుతూ టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి జేఏసీ నాయకులకు ప్రమాణ పత్రాన్ని శుక్రవారం అందజేశారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం ప్రమాణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధన తన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎస్.మోహనరావు, బి.ధనుంజయరావు, సీహెచ్ భాస్కరరావు, ఆర్.శేషు, పి.జోగారావు, ఎస్.సత్యం, లకీష్మపతి కాంగ్రెస్ నాయకుడు శిగిలిపల్లి శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యాయ జేఏసీ నాయకులంతా పాల్గొన్నారు.