తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయండి

8 Jul, 2014 02:40 IST|Sakshi
తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయండి

జీవో 89ను రద్దు చేయాల్సిందే..
మూడో రోజుకు చేరిన ప్రవీణ దీక్ష

 
హైదరాబాద్ : విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్(ఎండీఎస్) పీజీ మెడికల్ అడ్మిషన్లలో తెలంగాణ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ప్రవీణానాయక్ చేపట్టిన నిరాహార దీక్ష సోమవారానికి మూడో రోజుకు చేరింది. దీక్షకు గిరిజన ఉద్యోగ సంఘం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గిరిజన సంఘం, ఏఐఎస్‌ఎఫ్‌లు సంఘీభావం ప్రకటించాయి.

ఈ సందర్భంగా జీవో నంబరు 89ని రద్దు చేయాలని నినాదాలు చేశారు.  అనంతరం ప్రవీణ్‌నాయక్ మాట్లాడుతూ పీజీ మెడికల్ ఎంట్రెన్స్‌లో తనకు ఎస్టీ కోటాలో రాష్ర్టంలో ప్రథమ ర్యాంకు, ఓపెన్ కేటగిరిలో 216వ ర్యాంకు వచ్చినా.. సీమాం ధ్ర అధికారులు తనకు సీటు ఇవ్వలేదని ఆరోపించారు.
 
 

మరిన్ని వార్తలు