'స్వచ్ఛ హైదరాబాద్‌'లో మంత్రులు

4 Jun, 2015 15:31 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో భాగంగా గురువారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అబ్కారీ శాఖ మంత్రి పద్మారావులు సుడిగాలి పర్యటనలు చేశారు. జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు