కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యం: డీఎస్‌

4 Jul, 2013 13:39 IST|Sakshi

హైదరాబాద్ : కాంగ్రెస్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండానే తెలంగాణను సాధించుకుంటామని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణను ఎప్పటికైనా కాంగ్రెసే ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగ బద్ధమైనదని.. ఆ విధానం ద్వారానే  ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని చెప్పారు.

తెలంగాణ సాధన కోసం ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారని డీఎస్ అన్నారు. ఈ విషయంలో కొంతమంది గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ సాధ్యమని డీఎస్ స్పష్టం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ స్పష్టంగా ఉందని, ఇచ్చిన హామీని పార్టీ తప్పకుండా నిలబెట్టుకుంటుందన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేయొద్దని డీఎస్ విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాలు సామరస్యంగా విడిపోతేనే మంచిదని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి ఒక్కటేనని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు