షిండేను కలసిన గజ్జెల కాంతం

12 Jul, 2013 16:30 IST|Sakshi

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో తెలంగాణ ప్రజాసంఘాల అధ్యక్షుడు గజ్జెల కాంతం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ఆయనతో కాంతం చర్చించారు. అయితే ఏపీ భవన్ వద్ద ఢిల్లీ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ జేఏసీ, సమైక్యాంధ్రా జేఏసీ నాయకులు ఆందోళన చేసే అవకాశాలు ఉన్నందున ఢిల్లీ పోలీసులు ఈ భద్రతను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు