కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది

21 Feb, 2014 11:43 IST|Sakshi
కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అసలు సిసలు సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు