ఉపాధ్యాయుడికి చెప్పుదెబ్బలు

3 Apr, 2017 19:04 IST|Sakshi
విద్యార్థినిలకు అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో ఉపాధ్యాయుడికి చెప్పుదెబ్బలు
 
నర్సన్నపేట(శ్రీకాకుళం జిల్లా): రవీంద్రభారతీ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎస్‌ అమ్మాజీరావుని స్థానికులు చెప్పులతో దేహశుద్ధి చేశారు. అమ్మాజీరావు, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్ధినులకు అసభ్యమెసేజ్ లు పెడుతుండటంతో వాళ్లు తమ తల్లిదండ్రులకు చెప్పారు.
 
తల్లిదండ్రులు ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్‌కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు.  అమ్మాజీరావు ప్రవర్తనలో ఏమాత్రం  మార్పు రాలేదు. దీంతో కొందరు స్థానికులు అతని సెల్ ఫోన్ ను లాక్కొని పరిశీలించగా అందులో అసభ్య మెసేజ్ లు కనిపించాయి. ఆగ్రహానికి లోనైన కొందరు మహిళలు అమ్మాజీరావు ని చెప్పులతో  చితకొట్టి పోలీసులకు అప్పగించారు.

 

మరిన్ని వార్తలు