సినీ నిర్మాత మృతి

6 Jun, 2015 01:32 IST|Sakshi

 పెనుగొండ రూరల్ : సినీనిర్మాత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నూలి రంగయ్య (78) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నూలి రంగయ్య నిర్మాతగా కృష్ణ హీరోగా వియ్యాల వారి కయ్యాలు, నూతనప్రసాద్ హీరోగా సమాధి కడుతున్నాం చందాలు ఇవ్వండి సినిమాలు నిర్మించారు. రంగయ్యకు ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.  
 

మరిన్ని వార్తలు