ఈనాటి ముఖ్యాంశాలు

7 Sep, 2019 19:59 IST|Sakshi

దేశం కలలను సాకారం చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారని.. వారందరికీ యావత్‌ దేశం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ శనివారం సమావేశం అయ్యారు. దేశంలోనే తొలిసారిగా వంద రోజుల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా ఇస్రో బృందం శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. యాదాద్రి ఆలయంలో తన ఫోటోలు పెట్టుకున్న కేసీఆర్‌ చర్చిలో, మసీదుల్లో కూడా ఇలానే చేయగలరా అంటూ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు