ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ కేబినేట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఈ నెల 8న ఆదివారం ఉదయం 11 గంటలకు తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణలోని గోదావరినదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగినట్లు నివేదికల్లో స్పష్టంమవుతోదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షా అస్వస్థతకు గురవ్వడంతో అహ్మదాబాద్లోని కేడీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.