‘యూఎస్‌లో ఎక్కువ సంపాదించేది తెలుగువారే’

13 May, 2017 18:28 IST|Sakshi
‘యూఎస్‌లో ఎక్కువ సంపాదించేది తెలుగువారే’

అమరావతి: కర్నూలులో భారీ సోలార్‌ పార్క్‌ ఏర్పాటుకానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వ్యవసాయ పంపులకు సోలార్‌తో నడిచే మోటార్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. దాదాపు వారం రోజులపాటు అమెరికాలో పర్యటించి వచ్చిన చంద్రబాబు.. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని అన్నారు. తన అమెరికా పర్యటనలో వ్యవసాయం కోసమే సమయం ఎక్కువగా కేటాయించినట్లు తెలిపారు.

అమెరికాలో భారతీయులే ఎక్కువగా సంపాదిస్తున్నారని, ఆ భారతీయుల్లో తెలుగువారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అమెరికా యూనివర్సిటీలతో ఏపీ అనుసంధానం కావాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్తు ప్లాంట్లు మరింత రావాల్సి ఉందని ఆశించారు. తాను రెండో సారి ఏపీలో విద్యుత్‌ సంస్కరణలు చేపడుతున్నానని, అందులో భాగంగా సోలార్‌ ప్లాంటును కర్నూలు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు