మన్యంలో మంచు దుప్పటి 

4 Nov, 2017 09:11 IST|Sakshi

సాక్షి, విశాఖ: మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. గత వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, మినుమలూరు ప్రాంతాల్లో పది గంటలు దాటిన సూర్యుడు కనిపించకుండా తెల్లటి పొగమంచు కమ్మేసింది. శుక్రవారం రాత్రి మినమలూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11 డిగ్రీలు, లంబసింగిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 

మరిన్ని వార్తలు