చలి గుప్పిట్లో విశాఖ ఏజెన్సీ

31 Dec, 2018 08:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. విశాఖ ఏజెన్సీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి, చింతపల్లిలో కూడా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. లంబసింగిలో '0' డిగ్రీలు, చింతపల్లి, జికె వీది 3, పాడేరు 9, మినుములూరు 7.2, జి మాడుగుల 7.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు