టీడీపీలోకి 8 మంది ఎమ్మెల్సీలు, చంద్రబాబుతో భేటి!

21 Jun, 2014 19:32 IST|Sakshi
టీడీపీలోకి 8 మంది ఎమ్మెల్సీలు, చంద్రబాబుతో భేటి!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలోకి 8 మంది కాంగ్రెస్‌, స్వతంత్ర ఎమ్మెల్సీలు చేరేందుకు రంగం సిద్ధమైంది. లేక్ వ్యూ అతిధి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పదిమంది కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్సీలు కలిశారు. చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీలలో గాదె శ్రీనివాసులనాయుడు, చైతన్యరాజు, రవికిరణ్‌వర్మ, బచ్చల పుల్లయ్య, ఇందిరా, శివకుమారి, వి.నారాయణరెడ్డి, షేక్‌ హుస్సేన్‌, రెడ్డప్పరెడ్డి, ఐలాపురం వెంకయ్యలున్నారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీడీపీకి కేవలం ఏడుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. అయితే శాసన మండలి అధ్యక్ష పదవిని కైవసం చేసుకునేందుకు 8 మంది ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రచించారు. 
మరిన్ని వార్తలు