జక్కంపూడి కాలనీలో ఉద్రిక్తత

17 Jun, 2016 13:41 IST|Sakshi

విజయవాడ: విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీలో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటాయించిన ప్లాట్లు ఖాళీ చేయాలని కార్పొరేషన్ అధికారులు ఒత్తిడి చేయడంతో లబ్ధిదారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమకు కేటాయించిన ప్లాట్లు బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్యే శరణ్యమని ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. గత నెలలో అగ్ని ప్రమాదం జరిగి వీరి ఇళ్లు కాలిబూడిదైపోవడంతో స్థలాలు కేటాయించారు. అయితే అనర్హులు కూడా వచ్చి ఉంటున్నారని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు