కృష్ణలంకలో ఆలయం తొలగింపు.. ఉద్రిక్తత

7 May, 2016 10:54 IST|Sakshi
కృష్ణలంకలో ఆలయం తొలగింపు.. ఉద్రిక్తత

కృష్ణలంక: విజయవాడ కృష్ణలంకలో ఉద్రికత్త చోటు చేసుకుంది. స్థానికంగా కృష్ణా నదీ కాల్వను ఆనుకుని ఉన్న అభయాంజనేయస్వామి ఆలయాన్ని రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. స్థానికులు, కమిటీ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరంణం ఏర్పడింది. గుడికి ప్రత్యామ్నాయం చూపించాలని ఎప్పటి నుంచే కమిటీ సభ్యులు అడుగుతున్నారు. అయితే, గర్భగుడి మినహా మిగిలిన వాటిని మాత్రమే తొలగిస్తామన్న రెవెన్యూ సిబ్బంది ఈ రోజు ఆలయం మొత్తాన్ని జేసీబీతో తొలగించేశారు. దీన్ని కమిటీ సభ్యులు నిమ్మల జ్యోతి, ప్రభాకర్ స్థానికులతో కలసి అడ్డుకోగా పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు