తాడిపత్రిలో సమైక్య ఉద్యమం ఉద్రిక్తత

6 Oct, 2013 16:43 IST|Sakshi

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం ఉద్రికత్తకు దారితీసింది. ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ పాటిస్తుండగా, కాంగ్రెస్ నాయకుడు జె.సి.ప్రభాకరరెడ్డి వారిని అడ్డుకున్నారు. షాపులు తీసి ఉంచాల్సిందేనని ఆయన పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రోడ్లను నిర్భందించి బంద్ పాటిస్తున్నారు.

మరిన్ని వార్తలు