గుండిమెడలో తీవ్ర ఉద్రిక్తత

7 Jun, 2020 21:38 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలోని తాడేపల్లి మండలం గుండిమెడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్వారంటైన్‌ సెంటర్‌ను తొలగించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి కిరణ్‌ ఆధ్వర్యంలో క్వారంటైన్‌ సెంటర్‌ను ముట్టడించారు. పేషెంట్లు, పోలీసులపై టీడీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. చివరకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

మరిన్ని వార్తలు