సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులు

24 Aug, 2019 11:38 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వసతి గృహాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు తిండి తిప్పలు మానేసి దీక్ష చేపట్టారు. యూనివర్సిటీ ప్రధాన గేటు ఎదురుగా బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో వర్సిటీ లోపలికి ఎవరిని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ దీక్ష విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించారు.

మరిన్ని వార్తలు