ఫిబ్రవరి 9వ తేదీన టెట్ పరీక్ష

17 Jan, 2014 19:09 IST|Sakshi

హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ను ప్రభుత్వం నుంచి గ్నీన్ సిగ్నల్ లభించింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. ఈ పరీక్షకు 4.49లక్షల మంది హాజరుకానున్నారు. కొన్నిరోజుల క్రితం విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ఈ మేరకు నిర్ణయం వెలువడింది. నిజానికి డిసెంబర్ 22 లేదా 29 తేదీల్లో టెట్‌ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యా శాఖ డిసెంబర్ మొదట్లోనే ప్రతిపాదనలను పంపింది. కానీ ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జనవరి 5న నిర్వహిస్తామని కోరినా స్పందించలేదు.

 

మరిన్ని వార్తలు