పెద్దాపురం(తూర్పుగోదావరి జిల్లా): తన బంగ్లాలోని ఉసిరి కాయలను కోయడానికి వచ్చిన ఇద్దరు చిన్నారులను ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు చితకబాదారు. ఈ సంఘటన పెద్దాపురం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థులు తరుణ్, హర్ష ఇద్దరూ పెద్దాపురంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్నారు.
చిన్నారులను చికిత్స నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బాలుర తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.