నలుగురు దొంగలు అరెస్ట్..

31 Jan, 2016 18:32 IST|Sakshi

- రూ. 7 లక్షల బంగారం స్వాధీనం
తెనాలి(గుంటూరు)

 రెండు తెలుగు రాష్ట్రాలలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను తెనిలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో చైన్‌స్నాచింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా.. చోరీల విషయం బయటపడింది. ఈ ముఠా ఇప్పటి వరకు పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లతో పాటు చోరీలకు పాల్పడినట్లు తేలడంతో.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

మరిన్ని వార్తలు