విజయలక్ష్మి హత్యకేసులో నిందితుడి అరెస్ట్

19 Apr, 2016 13:00 IST|Sakshi
విజయలక్ష్మి హత్యకేసులో నిందితుడి అరెస్ట్

జిల్లాకేంద్రంలోని శ్రీకంఠం సర్కిల్ వద్దనున్న ప్రశాంతిలాడ్జిలో హత్యకు గురైన విజయలక్ష్మి(24) కేసులో నిందితుడిని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు బస్వరాజ్ మాయమాటలు చెప్పి విజయలక్ష్మిని రెండు రోజుల క్రితం లాడ్జికి తీసుకువచ్చాడు. అనంతరం పథకం ప్రకారం హత్య చేసి పరారయ్యాడు. విజయలక్ష్మికి ఇదివరకే వేరొక వ్యక్తితో వివాహం అయింది. తనను పెళ్లి చేసుకోలేదనే కారణంతోనే బసవరాజ్ ఈ హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు