కడప పాతబస్టాండ్ వద్ద వ్యక్తి దారుణ హత్య

9 Dec, 2015 17:40 IST|Sakshi

కడప నగరంలోని పాతబస్టాండ్ వద్ద పట్టుపోగుల చంద్రశేఖర్(55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పరారయ్యారు. హత్యకు గురైన వ్యక్తి పట్టుపోగుల రెసిడెన్సీ యజమానిగా గుర్తించారు. డబ్బుల విషయంలో తేడా రావడంతో ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

మరిన్ని వార్తలు