గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

24 Sep, 2015 13:41 IST|Sakshi

గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలో నూజెండ్ల మండలంలోని కొండలరాయునిపాలెం- పువ్వాడ గ్రామాల మధ్య ఉన్న గుండ్లకమ్మ నదిలో గురువారం మధ్యాహ్నం స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్సై విజయ్‌చరణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం మొండెం మాత్రమే ఉంది. కాళ్లు, చేతులు నరికేసి ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
 

మరిన్ని వార్తలు