కూలిన వరదరాజస్వామి ఆలయ ప్రహరీ

22 Nov, 2015 12:15 IST|Sakshi

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని అతి పురాతనమైన మాణిక్య వరదరాజస్వామి ఆలయ ప్రహరీ ఆదివారం కూలిపోయింది. ఈ శిధిలాలు గర్భగుడిపై పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బలహీనపడిన గోడ కూలిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే చోళుల కాలం నాటి ఈ ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే. రాగి చెట్లు పెరుగుతూ శిధిలావస్థకు చేరిన ఆలయ ప్రహారీ గురించి 'సాక్షి' ఎన్నో సార్లు కథనాలను ప్రచురించింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయ ప్రహారీ కుప్ప కూలింది.



 

>
మరిన్ని వార్తలు