ప్రభుత్వ ఆస్పత్రిలో పురిటి బిడ్డ మాయం

2 Nov, 2015 11:29 IST|Sakshi

 ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డ అదృశ్యమైన ఘటన తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. వివరల్లోకి వెళితే.. ఏర్పేడు మండలం రావులవారి కండ్రిగ గ్రామానికి చెందిన గర్భిణి సుధ(23) డెలివరీ కోసం ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు ఆదివారం ఆడబిడ్డ పుట్టింది. కాగా.. సుధ నిద్రిస్తున్న సమయంలో పక్కనే ఉన్న బిడ్డ అదృశ్యమైంది. అర్థరాత్రి లేచి చూసేసరికి పక్కన లేకపోవడంతో.. తల్లి ఆందోళన చెంది.. సిబ్బందికి తెలిపింది. విషయం తెలిసిన సుధ బంధువులు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే పాప కనిపించకుండా పోయిందని.. ఆందోళన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు