ఇద్దరు బాలికల అదృశ్యం

21 Oct, 2015 14:19 IST|Sakshi

చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. బుగ్గవీధిలో మంగళవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న గాయత్రి (12), వెన్నెల (8) కనిపించకుండా పోయారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. జాడ లేకపోవడంతో బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు