ఎండిన పంట చూసి రైతు ఆత్మహత్య

15 Nov, 2015 18:17 IST|Sakshi

పత్తిపంట ఎండి పోవడంతో ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. లక్ష్మీకాంత్‌రెడ్డి నాలుగున్నర ఎకరాల్లో పత్తి పంట వేశాడు. వర్షాల్లేక ఎండిపోవడంతో మనస్తాపం చెందిన అతడు పొలంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విగత జీవిగా మారిన లక్ష్మీకాంత్ రెడ్డిని పోరుగు రైతులు సాయంత్రం గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు