ఏనుగుల గుంపు బీభత్సం

28 Dec, 2015 12:48 IST|Sakshi

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం ఎగువసంకిలి గ్రామంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని మూడు పూరిళ్లను ధ్వంసం చేయడంతో పాటు వరి, కంది చేనులను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో పలు ఇళ్లలో బియ్యం, ధాన్యం నిలువలతోపాటు నాటు కోళ్లు మృతిచెందాయి. ఆదివారం ఉదయం నాలుగు ఏనుగులు గ్రామంపైకి రావడంతో.. గ్రామస్థులు హడలిపోయారు. వెంటనే అటవీ అధికారులు స్పందించి తమను ఏనుగుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు.



 

మరిన్ని వార్తలు