కొత్త రాజధాని వద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

3 Apr, 2015 02:10 IST|Sakshi
కొత్త రాజధాని వద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
  • కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
  • తిరుపతి, తిరుమల: గుంటూరు, విజయవాడల (కొత్త రాజధాని) మధ్య ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ (ఈఎస్‌ఐ) ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో అవసాన దశలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విజయనగరం, తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం దత్తాత్రేయ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
     

మరిన్ని వార్తలు