విశాఖ జిల్లా చోడవరంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భారీ లోడ్తో దేవరపల్లి వైపు వెళ్తోన్న ఇసుక లారీ, మోటార్ సైకిల్ను వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు నేమాల వెంకటరమణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.