శ్రీశైలంలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి

13 Dec, 2015 19:24 IST|Sakshi

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి స్వల్పంగా జరుగుతోంది. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయం నుంచి 515 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని 0.249 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 55.3581 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 835.20 అడుగులుగా నమోదైంది. డిమాండ్ తక్కువగా ఉండటంతో ఉత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు