కిడ్నాప్ అయిన పురిటిబిడ్డ క్షేమం

24 Jan, 2015 18:34 IST|Sakshi

తిరుపతి (చిత్తూరు): చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ మెటర్నిటీ ఆసుపత్రిలో ఈ నెల 20న మాయమైన పురిటిబిడ్డ పీలేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యక్షమైంది. చంద్రగిరి మండలం మరవపల్లికి చెందిన మునిరాజు భార్య సోనియా డెలివరీ కోసం తిరుపతి ఆసుపత్రిలో చేరింది. బిడ్డ ప్రసవించిన కొద్దిసేపటి తర్వాత నర్సు వేషంలో వచ్చిన ఒకామె పురిటిబిడ్డను ఎత్తుకు పోయింది.

 

ఈ విషయం గురించి బిడ్డ తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బురఖా వేసుకొచ్చిన ఒకామె బిడ్డను పీలేరు ప్రభుత్వాసుపత్రిలో విడిచి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. బిడ్డ దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారని పీలేరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సహదేవయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు