సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాల ఎంపిక కోసం కేంద్ర రక్షణ శాఖ కమిటీ బుధవారం ఢిల్లీలో మొదటిసారి సమావేశమైంది. ఇందులో ఏపీ నుంచి ‘సవర’ గిరిజన సంప్రదాయాన్ని తెలిపే శకటం, నదుల అనుసంధానం, చరక ఉద్యమం సందర్భంగా ఏపీలో మహాత్మాగాంధీ పర్య టన శకటం, శ్రీకృష్ణదేవరాయలు రచన ఆముక్తమాల్యద శకటాల నమూనాలను ప్రదర్శించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల సంయుక్త సంచాలకులు కిరణ్ ఇందులో పాల్గొని శకటాల విశిష్టత ను వివరించారు. ‘సవర’ గిరిజన సంప్ర దాయ శకట నమూనాను ఎంపిక చేసినట్టు ఢిల్లీలో ఏపీ సమాచార శాఖ ప్రత్యేక అధికారి కె.జయరావు తెలిపారు.