ఆ పాపం చంద్రబాబుదే: జగన్

3 Dec, 2013 18:07 IST|Sakshi
ఆ పాపం చంద్రబాబుదే: జగన్

హైదరాబాద్: మిగుల జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కును రద్దు చేస్తూ సుప్రీకం కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి కౌంటర్ దాఖలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తెలిపారు. లోటస్పాండ్లో కృష్ణా నదీ జలాలపై బచావత్ అవార్డును  చంద్రబాబు అమలు చేయలేదని చెప్పారు.  నదీ జలాల విషయంలో రాష్ట్రానికిఅన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఏ విధంగా మిన్నకుండిపోయారో వివరించారు.

1973లో కృష్ణానదీ జలాలపై బచావత్ ఇచ్చిన తీర్పు ప్రకారం మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్కు పూర్తి హక్కులు లభించాయి. చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగులు జలాలు ఉన్నా ప్రాజెక్టులు కట్టడానికి ఆయన ప్రయత్నించలేదు. ఈ చంద్రబాబే దేవగౌడను ప్రధానిని చేశారు. కేంద్రంలో చక్రం తిప్పారు. ఆ సమయంలో కర్ణాటక సుప్రీం కోర్టుకు వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక వాదనకు పూర్తిగా మద్దతు ఇచ్చింది. 2000లో సుప్రీం కోర్టు రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. మిగులు జలాల హక్కును సుప్రీం కోర్టు  రద్దు చేసింది. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాబు కర్ణాటకతో కుమ్మక్కయినందునో, మంచి న్యాయవాదులను పెట్టనందునో అన్యాయమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పుపై  చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీలైనన్ని ప్రాజెక్టులు కట్టి జలాలపై హక్కు సాధించాలని  ఆరాటపడ్డారు. నికర జలాల్లో కేటాయింపులు పెంచుకునే ప్రయత్నాన్ని వైఎస్ చేశారు. అటువంటి మహానేతను విమర్శిస్తున్నారని బాధపడ్డారు. ఆ మహానేత తరువాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వారిని విమర్శించకుండా ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఆ మహానేతను చంద్రబాబు విమర్శిస్తారన్నారు.

2009లో డిసెంబర్ 9న ఏఐసిసి అధ్యక్షురాలు  సోనియాగాంధీ పుట్టనరోజు సందర్భంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించారు. 2010లో కృష్ణాజలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు వచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయానికి మిగులు జలాల అంశం లేకుండా చేయాలని సోనియా గాంధీ అనుకున్నారు. ఇది సంక్షిష్ట అంశం కాకూడదని భావించారు. డిసెంబరు 9లోగా రాష్ట్రాన్ని విడగొట్టాలని అనుకున్నారు. అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ హడావుడిగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. మిగులు జలాలే లేవు, మీ చావు మీరు చావండని తీర్పు ఇచ్చారని చెప్పారు.  ఇలాంటి కుట్ర ఒకటి పెట్టుకున్న సోనియాను తప్పపట్టకుండా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపట్టకుండా 4 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని వేలెత్తి చూపుతున్నారన్నారు. ఆ మహానేత వైఎస్ మరణించి 4 ఏళ్లు గడచిని తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ సమయంలో సమర్థవంతంగా వాదనలు వినిపించవద్దని, మరో కోణంలో వాదించవద్దని ఎవరైనా చెప్పారా? అని అడిగారు.

సోనియా చర్యలను  చంద్రబాబు వ్యతిరేకించరు.  పైగా సమర్థిస్తారు. ఇలాంటి దారుణ రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం అని అన్నారు. ఏంచేస్తుందో కాంగ్రెస్కు తెలుసా? రాయలసీమను విభజించే హక్కు ఎవరు ఇచ్చారు? అని జగన్ ప్రశ్నించారు.  రెండు జిల్లాలకు బదులు అన్ని జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రం అని పేరుపెడితే ఎవరు కాదన్నారు? అని జగన్ ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. తమకు ముగ్గురు సభ్యుల బలమే ఉన్నా తమ ప్రయత్నాలు తాము చేసస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే దేశమంతటా పర్యటించి జాతీయ నేతలను కలుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నదీజలాలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు అని తెలిసి కూడా విభజన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీట్లుకోసం, ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించాలని కోరుతున్నట్లు తెలిపారు. దీనికి సహకరించాలని అన్నిపార్టీల నేతలకూ విజ్ఞప్తిచేస్తున్నామని చెప్పారు. మొదటి ఎస్సార్సీ నివేదికపై భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. 2/3 మెజార్టీతో అసెంబ్లీ, పార్లమెంటు తీర్మానాన్నిఆమోదించిన తర్వాతనే ఏ రాష్ట్రాన్నైనా విభజించాలని  అన్నారు.

మరిన్ని వార్తలు