రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

11 Jan, 2016 11:36 IST|Sakshi

బలిజపేట మండలం అంతవరం గ్రామశివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మోటారుబైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బలిజపేట మండలం కావారివాడ గ్రామానికి చెందిన రావెలపల్లె మధుసూదన్ రావు(29) అనే యువకుడిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

మరిన్ని వార్తలు