రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

10 Mar, 2016 11:13 IST|Sakshi

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురు యవుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహనంది పుణ్యక్షేత్రంసమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

మహనందికి చెందిన రాజశేఖర్(22) తన ఇద్దరు మిత్రులతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రాజశేఖర్ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు