గాలేరు-నగరి కాల్వలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మంగళవారం శవమై కనిపించాడు. వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం తమ్మాటవారిపల్లె గ్రామానికి చెందిన మహేష్కుమార్రెడ్డి (19) తన స్నేహితులు ఈతకు వెళుతున్నారని తెలిసి సోమవారం సాయంత్రం ఇంటి నుంచి గాలేరు-నగరి కాల్వ వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో అతడి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల విచారించారు. మంగళవారం ఉదయం కాల్వలో మృతదేహం కనిపించడంతో స్థానికులు చూసి మహేష్కుమార్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.